Kantara: కాంతార మూవీ మరో ఘనత, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్క్రీనింగ్
Kantara Movie screening in UN Head Quarters on March 17
రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ సంచలనాలు నమోదు చేసింది. విడుదలైన ప్రతిచోటా ప్రేక్షకులను అలరించింది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
తాజాగా ఈ సినిమా మరో ఘనత సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కాంతారా మూవీ స్క్రీనింగ్ కానుంది. జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో కాంతారా మూవీ స్ర్కీనింగ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రిషబ్ శెట్టి భారత సినిమా పరిశ్రమ తీరుతెన్నులపై ప్రసంగం చేయనున్నారు.
సెంటర్ ఫర్ గ్లోబర్ అఫైర్ అండ్ పబ్లిక్ పాలసీ (CGAPP) తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. CGAPP డైరెక్టర్ అనింద్యా సేన్ గుప్తా, రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసింది. జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి సమావేశంలో రిషబ్ శెట్టి భారత సినిమాల గురించి ప్రసంగిస్తారని తెలిపింది. పర్యావరణం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కాంతారా సినిమా ఎందరికో స్పూర్తిని అందించిందని CGAPP తెలిపింది.
.@shetty_rishab will be talking about Indian Cinema's role in fostering discussions on environment, climate & conservation, at UNHRC Session in Geneva. CGAPP Director Anindya Sengupta met him on the sidelines of the Session as #Kantara star brings Indian stories to world stage. pic.twitter.com/39ugg0iv12
— Centre for Global Affairs & Public Policy (@CGAPPIndia) March 15, 2023