Kangana Ranaut: ట్విట్టర్ గూటికి తిరిగొచ్చిన కంగన..
Kangana Ranaut twitter account reactivated on January 24
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలంగా ట్విట్టర్ నుంచి దూరంగా ఉంటున్న కంగనా మనసు మార్చుకుంది. కంగన తిరిగి ట్విట్టర్ మాధ్యమంలో యాక్టివ్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
2021 మే నెలలో కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెపై నిషేదం కొనసాగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పం అయ్యాయి. అటువంటి అభ్యంతరకర కామెంట్లు చేసిన కారణంగా కంగనా ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేయబడింది. దాదాపు 20 నెలల నిషేధం తర్వాత కంగన ట్విట్టర్ అకౌంట్ రీ యాక్టివేట్ అయింది. హల్లో ఎవ్రీ వన్, ఇట్స్ నైస్ టు బీ బ్యాక్ హియర్ అంటూ కంగన ట్వీట్ చేసింది. తాజాగా తాను నటిస్తున్న సినిమాకు చెందిన విషయాలను పంచుకుంది.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎమర్జెన్సీ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దృశ్యాలను కంగన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమా విడుదల కానుందని కంగన ట్వీట్ ద్వారా తెలియజేసింది.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
And it’s a wrap !!!
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023