హీరో రాజశేఖర్ పై క్రిమినల్ కేసు.. త్వరలో జైలుకు?
సినీ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి మమ్మల్ని మోసం చేశారని జీస్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ ఆరోపించారు. జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయట ప్రపంచంలో చలామణి అవుతున్నారని ఆమె అన్నారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల మేము వారికి పరిచయం అయ్యామని, ఇప్పుడు రాజశేఖర్ ,జీవితాల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఆమె అన్నారు. జోస్టర్ ఫిలిం గ్రూప్స్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమక్షంలో మేము పిఎస్-4 గరుడ వేగ సినిమా తీసామని, రాజశేఖర్ తమ ఆస్తులను మా వద్ద తాకట్టు పెట్టి 26 కోట్లు రూపాయలు అప్పు తీసుకున్నారని అన్నారు. మా వద్ద ప్రాపర్టీ పెట్టి మమ్మల్ని మోసం చేసారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. సినిమాకు మేము డబ్బు పెడితే సంజయ్ రామ్ కు మా సినిమాను అమ్మాడని ఈ విషయం మీద త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడని అన్నారు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషని పేర్కొన్న ఆయన అవకాశం కోసం జీవిత, రాజశేఖర్ మమ్మల్ని వాడుకున్నారని ఆరోపించారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చెక్ బౌన్స్ అయిన కేసులో నగిరిలో జీవిత,రాజశేఖర్ పై కేసు నమోదు చేశారని అన్నారు.