అఫీషియల్: ఆచార్య కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్న మహేష్
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక గత రెండు రోజులుగా ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక భాగం కానున్నట్లుగా గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్న తరుణంలో దీనిని మెగాస్టార్ స్వయంగా కన్ఫర్మ్ చెయ్యడం ఆసక్తిగా మారింది.మహేష్ కు థాంక్స్ చెప్తూ చిరు ఒక ట్వీట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ” “ఆచార్య” లో పాద ఘట్టాన్ని మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. రామ్ చరణ్ కు అలాగే నాకు నచ్చినంతగా అభిమానులు మరియు ప్రేక్షకులు మీ మాట వినడానికి థ్రిల్ అవుతారని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!
— Acharya (@KChiruTweets) April 22, 2022