Mega Meet: చిరంజీవితో అనురాగ్ ఠాకుర్ భేటీ, దేనికి సంకేతం ?
Anurag Thakur meets Mega Star Chiranjeevi
మెగాస్టార్ నివాసం సందడిగా మారింది. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్ చిరంజీవి నివాసానికి రావడమే దీనికి కారణం. హైదరాబాద్ నగరంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన అనురాగ్ ఠాకుర్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవి, అల్లు అరవింద్ తో పాటుగా హీరో నాగార్జున కూడా అక్కడ కనిపించారు. సినీ రంగానికి చెందిన పలు విషయాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగిన సందర్భంగా చిరంజీవికి ఈ అవార్డు అందించారు. ఆ అవార్డు ఫంక్షన్ జరిగిన నాటి నుంచి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ చిరంజీవితో టచ్ లో ఉన్నారు. పలు సందర్భాల్లో పలకరింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రి అనురాగ్ ఠాకుర్ తన నివాసానికి వచ్చి కలిసిన విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలవడానికి సమయం కేటాంయించిన మంత్రికి మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు. భారత చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పుల విషయంలో సోదరుడు నాగార్జునతో కలిసి మేమందరం చర్చించిన విషయాలు ఎంతో సంతోషం కలిగించాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
చిరంజీవితో నిరంతరం టచ్ లో ఉండడం ద్వారా చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించే పని నెమ్మదిగా జరుగుతోందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. సినీ తారలను, క్రికెట్ స్టార్లను తమ పార్టీ ప్రయోజనాలకు వీలుగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే చిరంజీవికి మరింత దగ్గర అవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday.
Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna
about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023