StockMarket: దేశీయ స్టాక్ మార్కెట్లు (StockMarket) జోరుమీదున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల (Investers) మద్ధతు లభించడంతో రోజంతా అదే రీతిలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Internatinal market) నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికే సూచీలు లాభాల్లోనే పయనించాయి.
StockMarket: దేశీయ స్టాక్ మార్కెట్లు (StockMarket) జోరుమీదున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల (Investers) మద్ధతు లభించడంతో రోజంతా అదే రీతిలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Internatinal market) నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికే సూచీలు లాభాల్లోనే పయనించాయి. మదుపర్లు ఎక్కువగా కొనుగోళ్లు జరపడంతో.. సెషన్లో ఎక్కడా కూడా సూచీలు నష్టాల్లోకి వెళ్లలేదు. సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) చివరికి ఐదు నెలల గరిష్టం వద్ద ట్రేడింగ్కు ముగించాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 317.81 పాయింట్లు లాభపడి 62,345 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 84.05 పాయింట్ల లాభంతో 18,398 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ డాలరుతో రూపాయి మారకపు విలువ 13 పైసలు పతనమైంది. చివరికి రూ. 82.31 వద్ద ఉంది.
ఈరోజు రిలయన్స్, సన్ఫార్మా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యునిలివర్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి.