Stock Markets:వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets Today Update: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లోనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఇవాళ ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం రానుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో, వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 53 వేల 416కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15 వేల 938 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి.
ఇవాళ సన్ ఫార్మా 2.28 శాతం లాభాన్ని అర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ 1.73 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.50 శాతం, మారుతి 1.45 శాతం, టైటాన్ 0.85 శాతం లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్ -1.74 శాతం నష్టపోగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్ -1.53 శాతం, ఎస్బీఐ -1.48 శాతం, టెక్ మహీంద్రా -1.44 శాతం, టీసీఎస్ -1.31 శాతం నష్టపోయాయి. డాలరుతో పోల్చుతే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో రూ.79.88 స్థాయికి పడిపోయింది.