దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల (International Markets) నుంచి ప్రతికూల సంకేతాలతో రోజంతా అదే రీతిలో కొనసాగాయి.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల (International Markets) నుంచి ప్రతికూల సంకేతాలతో రోజంతా అదే రీతిలో కొనసాగాయి. ఇన్వెస్టర్లు (Investers) ఇవాళ అప్రమత్తంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 365 పాయింట్లు నష్టపోయి 64,886 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 120 పాయింట్లు నష్టంతో 19,265 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.69 వద్ద ఉంది. ఇక సెన్సెక్స్లో ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే నేడు లాభపడ్డాయి. రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, వేదాంత లిమిటెడ్, మారుతి, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్, హీరోమోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, టాటా స్టీల్, యస్ బ్యాంక్, బజాజ్ ఆటో, పవర్గ్రిడ్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్టీ, హిందుస్థాన్ యునిలివర్, ఐటీసీ షేర్లు భారీగా నష్టపోయాయి.