Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికి కొనుగోళ్ల మద్ధతు లభించడంతో లాభాల బాట పట్టాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికి కొనుగోళ్ల మద్ధతు లభించడంతో లాభాల బాట పట్టాయి. చివరి గంట సమయంలో కొనుగోళ్ల ఒత్తిడి పెరగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజులుగా సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 193 పాయింట్ల నష్టంతో 62,428 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 46.65 పాయింట్లు నష్టపోయి 18,487 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.42 వద్ద ఉంది.
ఇక రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ, ఎల్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, హెచ్సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఐటీసీ, కోటక్ మహీంద్రా, ఎన్జీసీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునిలివర్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలతో ముగిశాయి.