Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాటలో కొనసాగాయి.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాటలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International market) నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో సూచీలు కలవర పడ్డాయి. రోజంతా అమ్మకాలు జరిపిన ఇన్వెస్టర్లు (Investers) చివరి గంట సమయంలో కొనుగోళ్ల వైపు మెగ్గు చూపడంమతో మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో చివరి క్షణంలో సూచీలు లాభాలతో క్లోజ్ అయ్యాయి.
ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (sensex) 99 పాయింట్లు లాభపడి 61,872 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 36 పాయింట్ల లాభంతో 18,321 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.75 వద్ద ఉంది. ఇక పవర్గ్రిడ్, వేదాంత లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిక్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, బజాజ్ ఆటో షేర్లు ఇవాళ లాభపడ్డాయి. అలాగే రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్టీ, ఎన్టీపీసీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు నష్టాలతో ముగిశాయి.