YS Sunitha: వివేకా హత్య కేసులో సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్..కీలక అంశాలు తెర మీదకు
YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసులో సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ లో కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి. అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని, సునీల్ యాదవ్ గూగుల్ టెకౌట్ లొకేషన్ ఆధారంగా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడని తేలిందని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ పలుమార్లు వెళ్ళాడని ఆమె పేర్కొన్నారు. ఇక 2017 ఎంఎల్సి ఎన్నికల్లో వివేకాని కావాలనే ఓడించారని, 2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకాకు టికెట్ ఇస్తున్నారననే సమాచారంతో హత్య చేశారని పేర్కొన్నారు. హత్య గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసని, హత్య చేశాక అందరిని అవినాష్ కాపాడుకుంటాడాని ఎర్ర గంగి రెడ్డి మిగిలిన నిందితులకు చెప్పాడని పేర్కొన్నారు. వివేకా మరణం వార్తను మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచి చూశారని, అలా రాజశేఖర్ రెడ్డి తమ్ముడు శివ ప్రకాష్ రెడ్డి వివేకా మరణ వార్తను అవినాష్ కు సమాచారం ఇచ్చాడని అన్నారు.
విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి 2 నిమిషాల్లోనే వివేకా ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, తదితరులు ఉన్నారని, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ అవినాష్ రెడ్డి ఇంట్లో చూపించిందని పేర్కొన్నారు. వివేకా ఇంటికి వచ్చిన శశికళ కి గుండె పోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడని, పోలీసులకు సైతం వివేకా గుండె పోటుతో పాటు, రక్తపు వాంతులతో చనిపోయినట్లు చెప్పాడని పేర్కొన్నారు. హత్య కాదు, సాధారణ మరణం అని చిత్రకరించే ప్రయత్నం చేశాడని, గంగాధర్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కీలక అంశం బయట పడిందని పేర్కొన్నారు. వివేకా ను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్మెంట్ ఇచ్చాడని పేర్కొన్నారు. ఇక మాజీ సీఐ శంకరయ్య స్టేట్మెంట్ ప్రకారం వివేకా గుండె పోటుతో చనిపోయాడని స్వయంగా అవినాష్ కాల్ చేసి చెప్పాడని , విచారణకు సహకరించకుండా అవినాష్ రెడ్డి కోర్టులలో తప్పుడు కేసులు వేస్తున్నాడని ఆయన అన్నారని గుర్తు చేశారు.
ఆధారాలు లేని ఆరోపణలు నాపై, నా కుటుంబం పై అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడని, పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఏపీ అధికారులు వారి పలుకుబడి ఉపయోగించి అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారని ఆమె పేర్కొంది. సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణ రెడ్డి, గంగాధర్ రెడ్డి లతో తప్పుడు ఆరోపనలు చేస్తూ సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొంది. అవినాష్ విచారణ సందర్భంగా ఆడియో , వీడియో అవసరం లేదని ఆమె అన్నారు. ఇక నామీద నా కుటుంబం మీద ఆరోపణలు చేశారు కాబట్టే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని వెల్లడించారు.