Supreme Court: ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం
Supreme Court: పోలవరం కేసులో ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై గతంలో విధించిన జరిమానా చెల్లించకపోవడంపై సుప్రీం ఆగ్రహం చేసినట్టు తెలుస్తోంది. పెనాల్టీ చెల్లించడం ఫేవర్ చేయడం కాదని, మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి ఆదేశాలు అమలు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం పర్యావరణ ఉల్లంఘనలు ధృవీకరిస్తూ జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా గతంలో ఎన్జీటి రూ. 242 కోట్లు పెనాల్టీ విధించగా ఎన్జీటి తీర్పును సుప్రీంలో సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం.
నిపుణుల కమిటీ దృవీకరించిన జరిమానా చెల్లించాల్సిందేనని 17 అక్టోబర్ 2022 న ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.242 కోట్లు పెనాల్టీ విధించాలా? లేదా? అన్నదానిపై విచారణ కొనసాగిస్తామన్న సుప్రీంకోర్టు, జరిమానా చెల్లింపు పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సుప్రీం హెచ్చరించింది. మరోపక్క పురుషోత్త పట్నం రైతులకు ఆరేళ్లుగా నష్టపరిహారం ఇవ్వడం లేదని పిటీషనర్ల తరపు న్యాయవాది కె. శ్రవణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లి జోషిమఠ్ తరహాలో పోలవరం వద్ద భూమిపై చీలికలు వచ్చాయి అని పేర్కొన్నారు. ఇక తదుపరి విచారణలో అన్ని విషయాలను పరిశీలిస్తామన్న న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, సుందరేశ్ ల ధర్మాసనం తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.