Kodi Katthi Case: జగన్ గైర్హాజరు.. కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా!
Kodi Katthi Case: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు కోడి కత్తి దాడి నిందితుడు శ్రీనివాసరావు, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. దినేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షి, ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. బాధితుడు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని గతంలో ఎన్ఐఏ కోర్టు ఆదేశించిందని అంటున్నారు. అయితే ఈ కేసులో బాధితుడైన సీఎం జగన్ హాజరు కాలేదు, బాధితులు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారని, బెయిల్ కూడా రాలేదని అంటున్నారు. ఇక దాడికి వాడిన కోడి కత్తి గురించి న్యాయమూర్తి ఆరా తీసి దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.