Gudivada Amarnath: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023ను విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తాజాగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..వచ్చే మార్చి 3,4 తేదీల్లో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమ్మిట్ నిర్వహించలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
అగ్రి,మెరైన్,డిఫెన్స్,ఆటోమోటివ్,ఎలక్ట్రిక్ వెహికల్స్,టూరిజం,హెల్త్ కేర్ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. జనవరి 2024 నాటికి రామాయపట్నం పోర్టు కు మొదటి ఓడ తీసుకోస్తామని.. యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగాల లక్ష్యంగా సమ్మిట్ జరుగుతుందని మంత్రి చెప్పారు. సమ్మిట్ కు ముందు పలు దేశాల్లో రోడ్ షోల నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తామని.. పారిశ్రామిక వేత్తలే ఈ సమ్మిట్ కు బ్రాండ్ అంబాసడర్ లుగా ఉంటారని అన్నారు
ఇక ప్రధాని మోడీ విశాఖ పర్యటనపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 11 న రాత్రి మోడీ విశాఖ చేరుకుంటారు. 12 న పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన పై పీఎంవోకి లేఖ రాశాం. ప్రధాని కార్యాలయం అంగీకరిస్తే అదే రోజు శంకుస్థాపన ఉంటుంది అని తెలిపారు.