CM Review : విశాఖలో జీ 20 సన్నాహక సదస్సు – సీఎం జగన్ సూచనలు
CM Jagan orders officials to Face lift of Vizag for G 20 meet
విశాఖ పట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. G–20 సన్నాహక సదస్సు కు ప్రపంచ దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్కొక్క జీ–20 సభ్య దేశం నుంచి ఆరుగురు చొప్పున హాజరు అవుతున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరు అవగా… కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారు.
మార్చి 28–29 మధ్య ఇన్ ఫ్రా స్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు.సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని, అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాకుండా, అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలనిఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచించారు.
ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు.ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని,ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్ యాప్ కూడా రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.