Ayyannapatrudu: అయ్యన్నపాత్రుడుకి సుప్రీం లో ఎదురుదెబ్బ
Ayyannapatrudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసు దర్యాప్తు జరపడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. నర్సీపట్నంలో తన ఇంటిని నిర్మించే సమయంలో ఎన్వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ చేశారని ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టును అయ్యన్న ఆశ్రయించారు.
దీంతో కేసు విచారణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. విచారణ జరిపిన ధర్మాసనం ఫోర్జరీ కేసు దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ 467 ప్రకారం విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది.