Ayyanna Patrudu: 2024 లో చంద్రబాబు సిఎం..నేనే హోంమంత్రిని ..అయ్యన్న పాత్రుడు
Ayyanna Patrudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగు తోందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మండలంలోని మోతడకలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొ న్నారు. ఎన్టీఆర్ పరిపాలించిన కాలం స్వర్ణ యుగం, ప్రస్తుతం రాష్ట్రం లో రాక్షసులు, దుర్మార్గులు,సైకో పరిపాలనలో ఉన్నామని, సైకో పాలన పోవాలంటే, సైకిల్ రావాలన్నారు
వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసి పైనే ఆధారపడుతున్నారన్నారు. ఊరూరా వాడవాడలా మద్యం షాపులున్న ఏమిచేయలేని అసమర్ధపాలన అంటూ ధ్వజమెత్తారు. పాతికేళ్ళ పాటు మద్యం షాపులు తనఖా పెట్టి ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చారు.ఇది మోసం చేయడం కాదా ? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తానే హోంమంత్రినని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. తొమ్మిది నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దూరం లేదన్నారు. అయితే తాను ఈసారి హోంమంత్రిని అవుతానని అప్పుడు ఇప్పుడున్న పోలీసులు మాకు సమాధానం చెప్పాలన్నారు. తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు.