AP High Court: సీఎస్ జవహర్ రెడ్డి.. ప్రవీణ్ ప్రకాశ్ కోర్టుకు రావాలి.. ఏపీ హై కోర్ట్
AP High Court: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి..విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కోర్టుకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అనంతపురం కదిరికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు 114 మంది తో కలిసి హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన అంశాన్ని ప్రస్తావించారు. పిటీషనర్లు అభ్యర్ధించిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ ఉత్త్వర్వులు అమలు చేయకపోవటంతో తిరిగి ఉమాదేవి హైకోర్టు లె కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు.
ఎయిడెడ్ ఉద్యోగులు తాము పని చేసే కశాశాలలో విలీనం చేసుకున్నా సీనియార్టీకి అవరోధం కల్పిచవద్దని పిటీషన్ లో అభ్యర్ధించారు. తమ స్థానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం పైన గత సెప్టెంబర్ లో న్యాయమూర్తి విచారించారు. ఈ వ్యాజ్యం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన అంశాన్ని ప్రస్తావించారు. కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి..విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కోర్టుకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం నోటీసులు ఇచ్చినా జవహర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాశ్ తరపున ఎవరూ హాజరు కాకపోవటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.